మాలల ఐక్యవేదిక సమితి గ్రామ కమిటీలు వేస్తున్న: మండల అధ్యక్షుడు

ధర్మపురి నవంబర్4 (జనం సాక్షి న్యూస్)తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొల్లం మల్లేశం, ఆదేశాలతో ధర్మపురి మండల అధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్, తో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కడారి రాజేష్ ,సట్టా సాగర్ వీరు సమక్షంలో అధ్యక్షుడిగా ఉట్ల శివ శంకర్, ఉపాధ్యక్షుడు మంత్రి శాంతయ్య, ప్రధాన కార్యదర్శిలు గా మంత్రి నరసయ్య, ఉట్ల సతీష్, కోశాధికారి ఎడ్ల శంకర్ ను ఎన్నుకున్నారు. తదనంతరం అధ్యక్షుడు మాట్లాడుతూ,
మాలల అస్థిత్వం, ఆత్మగౌరవం, హక్కులు, సాధికారత కోసం పని చేస్తుందని, ధర్మపురి మండల ధ్యక్షుడు అనంతుల లక్ష్మణ్ సూచిస్తూ,బుద్దేష్ పల్లి మాల కులస్తులకు,అర్హులకు ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ను అందిపుచ్చుకోవాలని సభను ఉద్దేశించి ఆయన అన్నారు.
ఈ సమావేశంలో సమితి ప్రతినిధులు ఎడ్ల లచ్చయ్య, ఎడ్ల చిన్న భూమయ్య,మంత్రి శ్రీనివాస్, ఎడ్ల నరసయ్య, కడారి పెద్ద వీరయ్య, కడారి చిన్న వీరయ్య, ఉట్ల రాజన్న, మంత్రి రెడ్డి, ఎడ్ల పెద్ద శంకరయ్య ఈ సమక్షంలో కుల నాయకులు తదితరులు పాల్గొన్నారు