మా గొంతు నొక్కేస్తున్నారు

3

– రాహుల్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి 24(జనంసాక్షి): ప్రభుత్వం తనను పార్లమెంట్‌ లో మాట్లాడనీయడనీయకుండా గొంతు నొక్కేస్తుందని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు.తనను చూసి మోదీ సర్కారు భయపడుతోందని  అన్నారు. బుధవారం పార్లమెంట్‌ వెలుపల విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘అన్ని అంశాలపై చర్చకు సిద్ధమని ప్రభుత్వం చెబుతోంది. కానీ పార్లమెంట్‌ లో తనను  మాట్లాడనీయడం లేదు. నేను మాట్లాడేటప్పుడు విూరే చూడండి. పార్లమెంట్‌ లో గళం విప్పకుండా నన్ను ప్రభుత్వం అడ్డుకుంటోంది. నేనేం మాట్లాడతానోనని ప్రభుత్వం భయపడుతోందని రాహుల్‌ గాంధీ అన్నారు. జేఎన్‌ యూ వివాదం, హెచ్‌ సీయూ విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని పార్లమెంట్‌ లో కాంగ్రెస్‌ డిమాండ్‌ చేస్తోంది.  జేఎన్‌యూ, హెచ్‌సీయూ వివాదాలపై పార్లమెంట్‌లో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు రాహుల్‌ గాంధీ తెలిపారు. ఈఅంశాలపై మాట్లాడుతున్నప్పుడు.. బీజేపీ ఎంపీలు తనను అడ్డుకుంటారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. క్యాంపస్‌ వివాదాలపై రహస్యాలను బయటపెడుతానన్న ఉద్దేశంతో బీజేపీ సభ్యులు తనను అడ్డుకుంటారనని రాహుల్‌ ఆరోపించారు.