మిలిటెంట్ల దాడిలో ఇద్దరు జవాన్లు మృతి

జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్-జమ్మూ హైవేపై పాంపోర్ దగ్గర సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనంపై మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. దగ్గర్లోని ఎంటర్‌ ప్రెన్యూర్ షిప్ డెవలప్ మెంట్ బిల్డింగ్ లో దాక్కున్న మిలిటెంట్లు జవాన్లపైకి కాల్పులు జరిపారు. లోపల ముగ్గురి నుంచి ఐదుగురు మిలిటెంట్లు ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఈ భవనంలో దాదాపు 50 మంది వరకు ఉద్యోగులు, 100 మంది విద్యార్థులు శిక్షణ పొందుతున్నారు. దాదాపు 70 మంది వివిధ మార్గాల ద్వారా భవనం నుంచి బయటకు వచ్చారు. మిగతా వారిని కూడా భద్రతా బలగాలు బయటికి తీసుకొచ్చాయి. ఐతే, కాల్పుల్లో ఒకరు గాయపడ్డారు. భవనాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఆపరేషన్ కొనసాగుతోంది.