మీరంతా ఏకపక్ష తీర్పును ఇస్తే నేను సిపాయిలా పనిచేస్తా-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

మీరంతా ఏకపక్ష తీర్పును ఇస్తే నేను సిపాయిలా పనిచేస్తా-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి బ్యూరో అక్టోబర్ 09 (జనంసాక్షి)మీరంతా ఏకపక్ష తీర్పును ఇస్తే నేను సిపాయిలా పనిచేస్తానని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.సోమవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో వెనుకబడిన తరగతుల నుండి ధరఖాస్తు చేసుకున్న 86 మంది దివ్యాంగులకు బ్యాటరీ వాహనాలను. లాంఛనంగా 16 మందికి అందజేశారు. మంత్రి మాట్లాడుతూ దివ్యాంగులకు అండగారూ.4016 ఫించను ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.మీరంతా ఏకపక్ష తీర్పును ఇస్తే నేను సిపాయిలా పనిచేస్తానని ,అభివృద్ధి లో వనపర్తి ని అగ్రస్థానంలో నిలబెట్టి సూపిస్తా అని ధీమా వ్యక్తం చేశారు.సంక్షేమ పథకాలే బిఆర్ఎస్ పార్టీకి శ్రీరామ రక్ష అని, ప్రతి గడపకు సంక్షేమం ప్రతి గల్లీలో అభివృద్ది జరిగిందన్నారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ప్రభుత్వ పథకం ను ప్రజల్లోకి వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాల అమలు చేస్తూ దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన్నారు.ప్రతి సంక్షేమ పథకం అమల్లో ఎలాంటి పైరవీలకు తావు లేకుండా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుంటే అర్హులు అయితే వారికి నేరుగా నగదు వారి ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు.మండలంలోని ప్రతి గ్రామంలో పాత, కొత్త నాయకులు సమిష్టిగా పని చేయాలని అన్నారు.సోమవారం ఉదయం మర్రికుంటలో 33/11 కేవీ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి,ఖిల్లా ఘనపురం మండలం ఆగారం గ్రామానికి చెందిన 100 మంది నాయకులు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కుమార్ ,జిల్లా అధికార ప్రతినిధి బాబురావులు వనపర్తి క్యాంపు కార్యాలయంలో కండువాలు కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు.అంతకుముందు బండారు నగర్ లో రూ.14 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనం ప్రారంభించి అనంతరం క్యాంపు కార్యాలయంలో క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు, గోపాల్ పేట, రేవల్లి మండలాల జర్నలిస్టులకు ఇండ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గట్టు యాదవ్,రమేష్ గౌడ్ ,వాకిటి శ్రీధర్, తిరుమల్ నందిమల్ల శ్యామ్, భువనేశ్వరి నాయకులు పాల్గొన్నారు.