మీ ఎన్నికల మేనిఫెస్టో మాకు పంపండి

3

– ఈసి సంచలన నిర్ణయం

హైదరాబాద్‌ అక్టోబర్‌ 04 (జనంసాక్షి):

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి అంకానికి (అక్టోబర్‌ 12) తెరలేవనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం దిశానిర్దేశం చేస్తోంది. ఎన్నికల నియమావళిని తప్పక పాటించేలా చర్యలు తీసుకుంటోంది. మరోపక్క తొలి దశ ఎన్నికలకు ప్రచారం వూపందుకుంది. అన్ని పార్టీలు హామీల జల్లుతో ఓటర్లను తడిపి ముద్ద చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో కాపీని తమకు పంపాల్సిందిగా ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ కాపీను తమ రికార్డుల నిమిత్తం రాజకీయ పార్టీలను కోరుతున్నామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అంతేకాకుండా మేనిఫెస్టోలో పార్టీలు ఎలాంటి హామీలు ప్రకటించాయో తెలుసుకునేందుకు ఉపయుక్తంగా కూడా ఉంటుందని వివరించారు.