ముంబయి పేలుళ్ల కేసులో మరో ముగ్గురికి వూరట

న్యూఢిల్లీ, జనంసాక్షి: సినీ నటుడు సంజయ్‌దత్‌ లొంగుబాటు గడువు పెంచిన సుప్రీంకోర్టు ఈ రోజు మరో ముగ్గురికి కూడా వూరట నిచ్చింది. 1993 ముంబయి పేలుళ్ల కేసులో దోషులుగా ఉన్న యుసఫ్‌, అల్త్యాఫ్‌, ఎసా మెమన్‌లు నాలుగువారాల్లో లొంగిపోవాలని ఉన్నత న్యాయస్థానం గడువు విధించింది.