ముంబైలో బాలికను అపహరించి అత్యాచారం చేశారు!

ముంబై: దేశ రాజధాని నగరమైన ఢిల్లీనే కాదు… ఆర్థిక రాజధాని అయిన ముంబై కూడా బాలికలకు సురక్షితం 26305257కాదని తాజాగా జరిగిన గ్యాంగ్ రేప్ సంఘటనతో తేలింది. పదో తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలిక ముంబైలోని నలసోపర రైల్వే స్టేషను నుంచి ఇంటికి వెళుతుండగా ఇద్దరు యువకులు ఆమెను అపహరించారు. అనంతరం నగరంలోని లాడ్జీకి తీసుకువెళ్లి నాలుగు రోజుల పాటు బంధించి స్నేహితులతో కలిసి బాలికపై సామూహిక అత్యాచారం జరిపారు. ఈ సంఘటన గురించి ఎవరికైనా చెపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బాలికను యువకులు హెచ్చరించారు. కామాంధుల బారినుంచి తప్పించుకొని ఇంటికి చేరిన బాధిత బాలిక తండ్రితో కలిసి పోలీసుస్టేషనుకు వచ్చి ఫిర్యాదు చేశారు. సామూహిక అత్యాచారం ఘటనపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు విచారణ పేరుతో బాలికను ప్రశ్నలతో వేధించారు. దీంతో జవహర్ నగర్ సమాజ్ సేవక్ సంస్థ సభ్యులు రంగంలోకి దిగి అత్యాచారానికి గురైన బాలికను న్యాయసహాయం అందించారు.ఈ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడైన దీపక్ మిశ్రాను పోలీసులు గుర్తించారు.