ముఖ్యమంత్రితో భేటీ అయిన కావూరి
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డితో కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు సోమవారం సమావేశం అయ్యారు. ఆంధ్రాభవన్లో కావూరి ఈ రోజు ఉదయం ముఖ్యమంత్రిని కలిశారు. అయితే భేటీ వివరాలు తెలియాల్సి ఉంది. కాగా హస్తినలో ముఖ్యమంత్రి పర్యటన రెండోరోజూ కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారు.