ముగిసిన జయలలిత అంత్యక్రియలు
జయలలిత పార్థీవదేహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో ఏర్పాటు చేసిన గంధపు చెక్కల పేటికలో ఉంచి మెరీనా బీచ్కు తరలిస్తున్నారు. లక్షల్లో హాజరైన అశేష జనవాహిని జయహో అమ్మ, పురుచ్చి తలైవీ, జయమ్మ అంటూ నినాదాలు చేస్తూ అంత్యక్రియలకు తీసుకెళ్తున్నారు. జయలలిత అంత్యక్రియలు మెరీనా బీచ్లో ముగిశాయి. జయలలిత అంతిమ సంస్కారాలను శశికళ నిర్వహించింది. శశికళ భావోద్వేగానికి గురయ్యారు. శశికళ చివరిసారిగా జయలలిత భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు. కేంద్రం అధికార లాంఛనాలతో జయలలిత అంత్యక్రియలను నిర్వహించింది. మెరీనా బీచ్లోని ఎంజీఆర్ సమాధి సమీపంలో జయలలితను ఖననం చేశారు. తమిళుల రోదనలు మిన్నంటాయి. చెన్నై శోకసంద్రమైంది. మెరీనా బీచ్ కన్నీటి సంద్రమైంది.