ముగ్గురు విద్యార్థుల డిబార్‌

మఠంపల్లి: మండలంలోని సెయింట్‌ ఆన్స్‌ ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రంలో చూచిరాతకు పాల్పడిన ముగ్గురు విద్యార్థులు మంగళవారం ప్రత్యేక తనిఖీ బృందానికి పట్టుబడ్డారు. వీవీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు. గురుకుల పాఠశాలకు చెందిన బాలిక చూచిరాతకు పాల్పడుతుండగా గుర్తించిన తనిఖీ బృందం విద్యార్థులను పరీక్ష కేంద్రం నుంచి బయటకు పంపి వేశారు.