ముగ్గురు వైద్య విద్యార్థినుల ఆత్మహత్య

ox5afdpcతమిళనాడులో ఘోరం జరిగింది. విల్లుపురంలోని ఓ మెడికల్ కాలేజీకి చెందిన ముగ్గురు మహిళా మెడికోలు బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఇష్యూ వివాదంగా మారుతోంది. కాలేజీలో వేధింపుల కారణంగానే మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. కాలేజీ మేనేజ్ మెంటే తమ మరణానికి కారణమని రాసిన సూసైడ్ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యువతుల మృతదేహాలను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెడికల్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని మృతుల బంధువులు హాస్పిటల్ ముందు ఆందోళనకు దిగారు.