ముచ్చటగా మూడోసారి గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే..

బి అర్ ఎస్ ప్రభుత్వం అంటే బిసి ల ప్రభుత్వం…
కుల వృత్తులు పూర్వ వైభవం వం తీసుకువస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ .
గౌడ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత…. నిజామాబాద్ బ్యూరో అక్టోబర్ 10(జనంసాక్షి): రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ముచ్చటగా మూడవసారి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు . మంగళవారం నిజామాబాద్ నగరంలోని గౌడ ఆత్మీయ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ
ఎన్నికల నగారా నిన్ననే మోగిందని,
మొట్టమొదటి సమావేశం గౌడ కుల బాంధావులతో జరురుకోవటం సంతోషకరం అన్నారు.గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను కల్లు వ్యాపారాన్ని చిన్న చూపు చూశారని,కానీ కేసీఆర్ ఆనడే ఉద్యమ సమయం లో చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అయితే గౌడ కులస్తులకు అండగా ఉంటాం అన్నారన్నారు.
అలాంటి కులవృత్తుల ను పునరుద్ధరించెందుకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని తెలిపారు.

గీత కార్మికుల కు ఏమైనా సమస్యలు ఉంటే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని,ప్రభుత్వం పాలసీ గా తీసుకొని ఈత వనాలని పెంచుతుందని అన్నారు. అంతే కాకుండా
మద్యం టెండర్ల లో 15 శాతం గౌడ కులస్తులకు రిజర్వేషన్ ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి నీ అధికారికంగా నిర్వహిస్తున్నమన్నారు.
గత ప్రభుత్వాల కాలం లో నిజామాబాద్ నుండి ఎంతో మంది పెద్దనాయకులు పనిచేశారని,జిల్లాకు ఒకటే బిసి హాస్టల్ ఉండే.అలాంటిది ఈరోజు 15 బిసి హాస్టల్ లను ఏర్పాటు చేసుకున్నాం అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది బిసి బిడ్డలకు ఫీజు రింయంబర్స్ మెంట్ ఇస్తున్నాం మన్నారు.

తెలంగాణ లోఉన్నది బి అర్ ఎస్ ప్రభుత్వం కాదు బిసి ల ప్రభుత్వం అని,ఎన్నికలపుడు అనేక పార్టీలు వస్తాయి.. వారిని నిలదీయండి.పనిచేశాం కాబట్టి హక్కుగా ప్రజల వద్దకు వస్తున్నాం ఆశీర్వదించండి అన్నారు.