ముదిరాజుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి – వేచరేణి సర్పంచ్ ఏనుగుల దుర్గయ్య

చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 10 : ముదిరాజుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని వేచరేణి గ్రామ సర్పంచ్ ఏనుగుల దుర్గయ్య, ముదిరాజ్ సంఘం గ్రామ శాఖ అధ్యక్షుడు పీ. శంకర్ లు తెలిపారు. గురువారం మండలంలోని వేచరేణి గ్రామంలో కొండయ్య చెరువులో చేప పిల్లలు వదిలారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ ఏనుగుల నర్సవ్వ-లక్ష్మి నర్సయ్య, చైర్మన్ పి.అంజయ్య, సాయిలు యాదగిరి, కనకయ్య చెరుకు బాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.