ముదిరాజ్ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలి: సాంబరాజు ముదిరాజ్

మల్కాజిగిరి. (జనంసాక్షి:) అక్టోబర్ 7

సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో జరిగే ముదిరాజ్ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మల్కాజిగిరి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చెరుకు సాంబరాజు ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శనివారం ముదిరాజ్ ఆత్మగౌరవ సభ పోస్టర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంబరాజు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ముదిరాజులను రాజకీయంగా అణిచివేస్తున్నారని జనాభా ప్రాతిపదికన తమ సీట్లు తమకే కేటాయించాలని డిమాండ్ చేశారు. నేడు జరగబోయే బహిరంగ సభకు మల్కాజ్గిరి నుండి పెద్ద సంఖ్యలో ముదిరాజు బిడ్డలు పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శివంది యాదగిరి, బాలచందర్ ,రవి, శ్రీను, ప్రసాద్, కిరణ్ ముదిరాజ్ లు, ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.