మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం ఖాయం కొండమల్లేపల్లి సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్

మునుగోడు ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయమని కొండమల్లేపల్లి సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు కుంభం శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు సిపిఐ, సీపీఎం బలపరిచిన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవబోతున్నారని ప్రజలు సంక్షేమానికి, అభివృద్ధికి ఓటు వేస్తారని తెలిపారు మునుగోడు ఉప ఎన్నికలలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, రైతులు, యువకులు, ప్రజలు అభివృద్ధికి ఓటు వేస్తారని తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు రైతులకు 24 గంటల కరెంటు సరఫరా, రైతుబంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, ధరణి యాప్ ఇలాంటి ఎన్నో చరిత్రలో మర్చిపోని సంక్షేమ పథకాలు అని కొనియాడారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని రైతుల కోసం, ప్రజల కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ గా మారబోతుందని తెలిపారు రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను పక్క రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అభినందనలు తెలుపుతున్నారు అని తెలిపారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం తో పాటు దేశం మొత్తం కేసీఆర్ సేవలు ఉంటాయని తెలిపారు కొంతమంది రాజకీయ నాయకులు పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు రాబోయే సాధారణ ఎన్నికలలో కూడా టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని తెలిపారు ఇన్ని రోజులు మునుగోడు ఉప ఎన్నికల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు శ్రమించిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు