మునుగోడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న న్యాల్కల్ మండల సీనియర్ నాయకులు

జహీరాబాద్ అక్టోబర్ 21 (జనంసాక్షి): మునుగోడు నియోజకవర్గం,నారాయణపూర్ మండలంలోని ‘గంగమొల్ల తండా’లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న న్యాల్కల్ మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మున్నూరు రవీందర్,న్యాల్కల్ జడ్పీటీసీ స్వప్నభాస్కర్..ఈ సందర్భంగా జడ్పీటీసీ స్వప్నభాస్కర్ మాట్లాడుతూ ఈ రోజు తండాలను గ్రామా పంచాయతీలుగా చేసిన ఘనత మన తెలంగాణ ప్రభుత్వం అని తెలిపారు..దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనటువంటి అనేక సంక్షేమ పథకాలతో పాటు..రాష్ట్రాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వం అని కోరారు..కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రాజకుమార్,హద్నూర్ గ్రామ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్,మండల సీనియర్ నాయకులు రాజ్ పాటిల్, బక్క రెడ్డి,యూత్ నాయకులు వసీమ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు