మున్నూరు కాపులు అన్నివిధాలా ఎదగాలి

– మహిళ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రంజిత

చేర్యాల (జనంసాక్షి) నవంబర్ 11 :మున్నూరు కాపులు అన్నివిధాలా ఎదగాలని మున్నూరు కాపు మహిళ కమిటీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాడెం  రంజిత-కృష్ణమూర్తి పటేల్ అన్నారు. శుక్రవారం చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో మున్నూరు కాపు మహిళా సంఘం ఆధ్వర్యంలో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆకునూరు గ్రామ గౌరవ అధ్యక్షురాలుగా పుప్పాల సులోచన, ఉపాధ్యక్షురాలుగా వెలుగల లక్ష్మి, తోట పద్మ, నల్లగొండ అర్చన, బీర రాజేశ్వరి, మైదాపు కవిత,తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.