మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం ప్లీనరీ విజయవంతం చేద్దాం

– నిర్మల్ జిల్లా కన్వీనర్ గుమ్ముల అశోక్
ఖానాపూర్ నియోజకవర్గ ప్రతినిధి ఆగస్ట్ 23(జనం సాక్షి): సెప్టెంబర్ 4న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవోఎస్ కల్యాణ మండపంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు జర్నలిస్ట్ ఫోరం మొదటి ప్లీనరీకి జర్నలిస్టులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం నిర్మల్ జిల్లా కన్వీనర్ గుమ్ముల అశోక్  పిలుపునిచ్చారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం డైరీ ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరు హాజరైయ్యేలా కృషి చేయాలన్నారు. జిల్లాలోని మున్నూరుకాపు జర్నలిస్టుల అందరికి సభ్యత్వం చేయించాలని కోరారు.  ఈ సమావేశంలో జిల్లా కో కన్వీనర్ పుప్పాల శేఖర్, మున్నూరు కాపు జర్నలిస్టులు సిరిపురం నాగరాజు, గాండ్ల రాజశేఖర్, కోమటి పెల్లీ వేణుగోపాల్, గడబోయిన అశోక్,మహేందర్,మొగిలి నర్సయ్య, కారింగుల రుత్విక్ తదితరులు పాల్గొన్నారు.