ముమ్మరంగ వాహనాలు తనిఖీలు

ముమ్మరంగ వాహనాలు తనిఖీలు

ఇటిక్యాల అక్టోబర్ 11(జనంసాక్షి ) రాష్ట్రంలో ఎన్నికల నగర మొగ రగడంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నూతనంగా ఏర్పడిన ఎర్రవల్లి మండల కేంద్రంలో బుధవారం ఇటిక్యాల ఎస్ఐ అశోక్ బాబు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రయాణికులు ఎవరు కూడా 50000 మించి నగదు ను తీసుకెళ్లరాదని అధిక మొత్తంలో తీసుకు వెళ్ళవలసి వస్తే నగదు కు పత్రాలు తప్పనిసరిగా ఉండాలని, లేని అట్టి నగదును సీజ్ చేయడం జరుగుతుందని ఎస్ఐ సూచించాడు దీనిని ప్రతి ఒక్కరూ పాటించాలని ఆయన వాహనదారులకు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. ఇతనికిలో కానిస్టేబుల్ వరదరాజులు, పాషా తదితరులు పాల్గొన్నారు.