ముస్లింలకు ఏ కష్టం వచ్చినా మేం అండగా ఉంటాం

4

ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6(జనంసాక్షి) : ముస్లింలకు ఏ కష్టం వచ్చినా తమ ప్రభుత్వం వారికి అండగా నిలబడుతుందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ మేరకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఈ రోజు ఒక ప్రకటన వెలువడింది. ఆ వివరాల ప్రకారం.. ముస్లిం సంఘాల ప్రజా ఫిర్యాదుల విభాగంలో ఈ రోజు ఆయన పాల్గొన్నారు. పరమత సహనంతో జాతి ఐక్యతకు పాటుపడతానని ఆయన వారికి భరోసా ఇచ్చారు. భారత్‌ ఆర్థిక శక్తిగా బలోపేతం కావడానికి ముస్లింలు చేయూతనివ్వాలని కోరార. వారి అవసరాలకు అనుగుణంగా గుణాత్మక విద్యను అందించడానికి ప్రభుత్వ సిద్ధంగా ఉందని తెలిపారు.