ముస్లింలకు టికెట్లివ్వకపోవడం తప్పే : ఉమాభారతి
లఖ్నవూ: భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు టికెట్లు ఇవ్వకుండా తప్పు చేసిందని భాజపా నాయకురాలు, కేంద్రమంత్రి ఉమాభారతి అన్నారు. భాజపా ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలకు కొన్ని స్థానాలు కేటాయిస్తే బాగుండేదన్న రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలను ఆమె సమర్థించారు. ఈ విషయం గురించి పార్టీ చీఫ్ అమిత్షాతో మాట్లాడతానని ఆమె అన్నారు. ముస్లింలకు, మహిళలకు పార్టీ టికెట్లు కేటాయించేటప్పుడు గెలుపు సామర్థ్యం ప్రాధాన్యం వహిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో యూపీలో ముస్లింలకు భాజపా కనీసం ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. సోమవారం ఉత్తరప్రదేశ్లో ఐదో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.