ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి అండగా.. కాంగ్రెస్ గెలుపు

భువనగిరి జనం సాక్షి :–
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి చెయ్యి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఉస్మా షాపేరా ఆద్వర్యం లో ముస్లిం మైనార్టీ వార్డులు వాడు పాడి నగర్ 76,77 బూతులలో మహేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని గడపగడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలతోపాటు ముస్లిం మైనార్టీ డిక్లరేషన్ మైనార్టీ ఓటర్లకు వివరిస్తూ ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని ముస్లిం మహిళలు మరియు యువకులకు వినిపించారు . ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నిర్ణయించిన పరిశీలకులు నాగేశ్వరరావు గారు, పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ బాబా, సయ్యద్ రషీద్ హుస్సేన్, మొహమ్మద్ ఫయాజ్, సేవాదళ్ జిల్లా కార్యదర్శి మొహమ్మద్ వాజిద్, లైక్ అహ్మద్. మైనార్టీ మహిళా నాయకురాలు ఇష్రాత్ , సయ్యద్ అహ్మద్ అయ్యో ఖాన్ ,సాజిద్ , వార్డ్ కమిటీ సభ్యులు మరియు బూత్ కమిటీ సభ్యులు ప్రచారంలో పాల్గొన్నారు.