మూడో ఫ్రంట్‌ ఊహాజనితం: ప్రధాని

న్యూఢిల్లీ, జనంసాక్షి:  కేంద్రంలో మూడో ఫ్రంట్‌ అనే అంశం ఊహాజనితమైందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ప్రధాని మంత్రి అభ్యర్థిగా రాహుల్‌గాంధీని ఎప్పుడైనా ఆహ్వానిస్తానని ఆయన స్పష్టం చేశాడు. మూడోసారి ప్రధానిగా కొెనసాగుతాననేది ఊహాజనితమైన విషయమన్నారు. కేంద్రంలో రెండు అధికార  కేంద్రాలున్నాయని వస్తున్న విమర్శలను మన్మోహన్‌ ఖండించారు. ఇదంతా మీడియా సృష్టేనని కొట్టిపడేశారు.