మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క

లక్నో: ప్రభుత్వ దవాఖానల్లో నిరక్ష్యం ఎలా ఉంటుందో చూపే మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్నది. లక్నోలోని రాంమనోహర్ లోహియా దవాఖానలోని మార్చురీ వార్డులో ఉంచిన మహిళ మృతదేహం శరీర భాగాలను ఓ కుక్క పీక్కుతిన్నది. ఈ ఘటనపై తీవ్ర ఆరోపణలు రావడంతో హాస్పిటల్ భద్రతా సూపర్‌వైజర్‌తోపాటు ఓ గార్డును విధుల్లో నుంచి తొలిగించారు. చిన్‌హట్ వాసి పుష్పా తివారీ (40) విషప్రయోగంతో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందింది. ఇది మెడికో లీగల్ కేసు కావడంతో శవపరీక్ష కోసం మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. ఆదివారం ఉదయం ఆమె మృతదేహాన్ని చూసిన బంధువులు ముఖం, మెడసహా పలు శరీర భాగాలను కుక్క పీక్కుతిన్నదని అధికారులకు ఫిర్యాదు చేశారు.