మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ప్రమోద్ రెడ్డి

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ప్రమోద్ రెడ్డి

వనపర్తి బ్యూరో అక్టోబర్13(జనంసాక్షి)గోపాల్ పెట్ మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన బిల్లకంటి రామారావు 70 ( సర్పంచ్ పద్మమ్మ భర్త ) అనారోగ్యం తో గురువారం రాత్రి మృతి చెందాడు. శుక్రవారం మృతుడి కుటుంబాన్ని వనపర్తి నియోజకవర్గ ఎన్నికల సమన్వయ కర్త వంగూరు ప్రమోద్ రెడ్డి
పరామర్శించారు. మృత దేహం వద్ద నివాళులు అర్పించారు. పరామర్శించిన వారిలో వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జె డ్పీ టీ సీ మంద భార్గవి, ఎంపీటీసీ శ్రీదేవి, ఉప సర్పంచ్ నాగరాజు, రైతు బంధు అధ్యక్షులు కృష్ణారావు, బీ ఆర్ ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శేఖర్ గౌడ్, నాయకులు మందకోటీశ్వర్ రెడ్డి, వడ్డెమాన్ రవి, వెంకటయ్య, శివ కుమార్, శ్రావణ్ కుమార్, కురుమయ్య,శేఖర్ తదితరులు ఉన్నారు