మృతురాలి కుటుంబానికి ఎంపీటీసీ ఆర్ధిక సహాయం..

చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 07 : చేర్యాల మండలంలోని వీరన్నపేట గ్రామంలో ఇటీవల మృతి చెందిన జంగ రేణుక కుటుంబాన్ని స్థానిక ఎంపీటీసీ శివశంకర్ గౌడ్ శనివారం వారి ఇంటి వద్దకు వెళ్లి పరామర్శించారు. అనంతరం 10వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. వారి వెంట వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు.