మృతుల కుటుంబాలకు ఎంపిపి పరామార్ష

మండల కేంద్రమైన తాడిచర్లలోని చొప్పరి రాజశేఖర్ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా సోమవారం ఎంపిపి చింతలపల్లి మల్హర్ రావు, కాంగ్రెస్ యూత్ నాయకుడు బొబ్బిలి రాజు, టియుడబ్ల్యూ జె యజేయు భూపాలపల్లి జిల్లా కోశాధికారి చింతల కుమార్ యాదవ్, మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ముడుతనపల్లి ప్రభాకర్ పరామార్షించి ఓదార్చారు.
టిఆర్ఎస్ నాయకుల పరామార్ష
తాడిచెర్లలోని చొప్పరి రాజశేఖర్, మల్లారం గ్రామంలోని సుదాటి రామారావు ల కుటుంబాలను టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవ రెడ్డి,పీఏసిఎస్ ఇంచార్జీ చైర్మన్ ప్రకాష్ రావు, యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, నాయకులు యాదగిరి రావు, కోట రవిలు పరామార్షించి ఓదార్చారు.