మేడిగడ్డపై నిపుణుల కమిటీ

` బ్యారేజ్‌ను పరిశీలించిన కేంద్ర బృందం
` ఇంజనీర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు
మహదేవ్‌పూర్‌(జనంసాక్షి):కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజ్‌ కుంగిన నేపథ్యంలో అక్కడ కేంద్ర బృందం పరిశీలించింది. వంతెన కుంగిన ఘటనపై ఆరుగురు నిపుణులతో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌ అనిల్‌ జైన్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ.. మంగళవారం బ్యారేజ్‌ను పరిశీలించింది. వంతెన కుంగిన ప్రాంతాన్ని, పగుళ్లు ఏర్పడిన ప్రదేశాన్ని కేంద్ర బృందం సభ్యులు ప్రత్యక్షంగా పరిశీలించారు. 20వ పిల్లర్‌ వద్ద నిచ్చెన సాయంతో కిందకు దిగి దెబ్బతిన్న ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. శనివారం రాత్రి ఏం జరిగిందన్నది ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన పూర్తయిన తర్వాత బ్యారేజీ నుంచి కేంద్ర బృందం సభ్యులు వెనుదిరిగారు. ఒకటి.. రెండు రోజుల్లో కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందజేయనున్నట్టు సమాచారం. కేంద్ర బృందం వెంట కాళేశ్వరం ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులు ఉన్నారు.మేడిగడ్డ బ్యారేజ్‌ కుంగిన నేపథ్యంలో నీటిని విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నీటి మట్టం కనిష్ఠ స్థాయికి చేరింది. బ్యారేజ్‌ ఎగువ నుంచి 57 గేట్ల ద్వారా 22,500 క్యూసెక్కుల వరదను దిగువకు విడిచిపెట్టారు. ఈ నెల 21న రాత్రి భారీ శబ్దంతో బ్యారేజ్‌ 20వ పియర్‌ కుంగిపోయింది. దీంతో బి`బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. బ్యారేజీ.. క్రస్టు గేటుకు మధ్య పగుళ్లు వచ్చాయి. గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీకి ఒకవైపు మహారాష్ట్ర, రెండోవైపు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నాయి. దీంతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ కుంగడంపై కేసు నమోదయ్యింది. మహదేవ్‌పూర్‌ పోలీసులు ఈ కేసు రిజిష్టర్‌ చేశారు. ఇరిగేషన్‌ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పిల్లర్‌ కింద భారీ శబ్దం రావడంతో కుట్రకోణం ఉందన్న అనుమానంతో అధికారులు ఈ ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పిల్లర్లు కుంగటంపై కుట్ర ఉందన్న కోణంలో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానంతోనే ఫిర్యాదు చేశారు. కాగా పబ్లిక్‌ ప్రాపర్టీ డ్యామేజ్‌ 3, 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసుపై విచారణకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. పిల్లర్‌ కింద భారీ శబ్దం వచ్చిందని ఫిర్యాదు ఇవ్వడంతో ఆ కోణంపై పోలీసులు దృష్టి పెట్టనున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ఇది జరగడంతో ఏదైనా కుట్ర జరిగిందా అనే కోణంలో పోలీసులు ఆరా తీయనున్నారు. కొన్న అసాంఘిక శక్తులు ప్రభుత్వానికి చెందిన ఈ బ్యారేజీకి నష్టం కలిగించారని ఘటన జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్న అసిస్టింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రవికాంత్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో  పేర్కొన్నారు. సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిందిగా పోలీసులకు విజ్ఞప్తి చేశారు. మహదేవ్‌పూర్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌కు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదులో పై అనుమానాన్ని వ్యక్తం చేశారు. భారీ శబ్దం వచ్చేంతవరకూ బ్యారేజీ బ్రిడ్జివిూద వాహనాల రాకపోకలు యధావిధిగానే జరిగాయని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం 6.20 గంటలకు భారీ శబ్దం వచ్చిందని, ఆ వెంటనే ఎల్‌ అండ్‌ టీ సంస్థకు చెందిన ఫోర్‌మాన్‌ బిద్యుత్‌ దేబ్‌నాధ్‌తో కలిసి ఘటనా స్థలం దగ్గరికి వెళ్ళి చూశామని, ఏడవ నెంబర్‌ బ్లాక్‌లో 19`21 పిల్లర్ల మధ్య ప్రాంతంలో బ్యారేజీ విూద ఉన్న రోడ్డు బ్రిడ్జి శ్లాబ్‌, పిట్టగూడ కుంగిపోయినట్లు గమనించామని, ఇది మహారాష్ట్ర సరిహద్దువైపు చోటుచేసుకున్నదని ఆ ఫిర్యాదులో రవికాంత్‌ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పబ్లిక్‌ ప్రాపర్టీ విధ్వంస నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విపక్షాలన్నీ నిర్మాణ లోపం, నాణ్యత లేకపోవడం, మానవ తప్పిదం, ఇంజనీరింగ్‌ డిజైన్‌లోనే పొరపాటు ఉండడం.. ఇలాంటి విమర్శలు వస్తున్న సమయంలో పోలీసులకు కుట్ర కోణంలో ఫిర్యాదు చేయడం..పోలీసులు కేసు నమోదు చేయడం ఆసక్తికరంగ మారింది. మరో వైపు మేడిగడ్డ బ్యారేజ్‌ ను కేంద్ర బృందం పరిశీలించింది.  నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ చైర్మన్‌ అనిల్‌ జైన్‌ ఆధ్వర్యంలో ఆరుగురు సభ్యుల కమిటీ.. మంగళవారం కుంగిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించింది.  సుమారు రెండు గంటల పాటు కుంగిన 20వ పిల్లర్‌ తోపాటు18, 19, 21వ పిల్లర్లను  కేంద్రం బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. పగుళ్లు వచ్చిన డ్యాం, క్రస్ట్‌ గేట్లను పరిశీలించిన కేంద్ర బృందం సభ్యులు.. బ్యారేజీ డిజైన్‌, నిర్మాణం వివరాలను రాష్ట్ర ఇరిగేషన్‌ అధికారుల నుండి వివరాలు రికార్డు చేసుకున్నారు. బ్యారేజీ పటిష్టత,  జరిగిన నష్టంపై  కేంద్ర బృందం అంచనా వేసింది. కేంద్రం బృందం ఇచ్చే నివేదిక కూడా కీలకం కానుంది. డిజైన్‌ లోపం లేదా.. నిర్మాణ లోపం  ఉంటే కేంద్ర బృందం ఆ విషయాన్ని వెల్లడిరచే అవకాశం ఉంది. విద్రోహ చర్య అయితే.. ఆ విషయాన్ని కూడా కేంద్ర బృందం వెల్లడిరచే అవకాశం ఉంది. ఒక వేళ కేంద్ర బృందం…  నాణ్యతాలోపం లేదా డిజైన్‌ లోపం వల్ల అనే నివేదిక ఇస్తే.. ప్రభుత్వం.. తమ తప్పును ఇతరులపై నెట్టడానికి విద్రోహచర్య అనే  ప్రచారం చేస్తున్నదన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

తాజావార్తలు