మొక్కలకు జియో ట్యాపింగ్‌

నిర్మల్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): హరితహారం ద్వారా జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని జి/-లా పంచాయితీ అధికారి అన్నారు. నాటిన మొక్కలను జీయో ట్యాగింగ్‌ చేశామని చెప్పారు. జిల్లాలో హరిత హారంలో నాటిన మొక్కల సంరక్షణకు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు. నాటిన మొక్కలను పెంచేందుకు కంచెలతో పాటు నీటిని అందించాలని తెలిపారు. ఇప్పటి వరకు జీయో ట్యాకింగ్‌ అయిన మొక్కల వివరాలను ఉన్నతాధికారులకు నివేదించారు.