మోడీకి నితీశ్‌ ఆహ్వానం

4yoxmaghశుక్రవారం జరగనున్న ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రధాని మోడీని నితీశ్‌ కుమార్‌ ఆహ్వానించారు. మధ్యాహ్నం రెండు గంటలకు పాట్నా గాంధీ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆయన కోరారు. ఈ మేరకు మోదీకి నితీశ్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, జైట్లీ, సుష్మా స్వరాజ్‌లకు కూడా నితీశ్‌ ఫోన్‌ చేసి ఆహ్వానం పలికారు. కాగా, ప్రధాని కార్యక్రమాలు ముందుగానే నిర్ణయమై ఉంటాయని అందువల్ల మోదీ ఈ కార్యక్రమానికి రాలేరని బీజేపీ బీహార్‌ ఉపాధ్యక్షుడు సంజయ్‌ మయుఖ్‌ తెలిపారు. కేంద్రం తరఫున మంత్రులు వెంకయ్య నాయుడు, రాజీవ్‌ ప్రతాప్‌ రూఢీలు హాజరవుతారన్నారు.