మోడీ నీ పాఠాలు వద్దు

వార్టన్‌ ఇండియన్‌ ఎకనామికల్‌ ఫోరం
అమెరికా పర్యటన రద్దు చేసుకున్న గుజరాత్‌ సీఎం
వాషింగ్టన్‌ :
ప్రతిష్టాత్మకమైన వార్టన్‌ ఇండియా ఎకనామిక్‌ ఫోరంలో ఈ నెలాఖరులో ప్రసంగించాల్సిన గుజరాత్‌ ముఖ్యమంత్రి మోడీకి చుక్కెదురైంది. నీ పాఠాలు మాకొద్దంటూ వార్టన్‌ యూనివర్సిటీలోని కొందరు ప్రొఫెసర్లు, విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆయన అమెరికా పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మోడీకి, వార్టన్‌ స్కూల్‌ అధికార యంత్రాంగానికి కలిగిన ఈ అసౌకర్యానికి నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు. మోడీ స్థానంలో మరో ముఖ్యనేత ప్రసంగిస్తారని తెలిసింది. ఆయన ఎవరనేది తర్వాత వివరాలు వెల్లడిస్తామని పేర్కొంది.