మోడీ పర్యటనకు బయలుదేరారు

d3xojf1iప్రధాని నరేంద్రమోడీ రెండు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ ఉదయం ఆరు గంటలకు ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. ఎయిరిండియా ప్రత్యేక విమానంలో ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ కు బయలుదేరారు. దీంతో 60 ఏళ్ల తర్వాత ఐర్లాండ్ లో పర్యటిస్తున్న తొలి ప్రధానిగా మోడీ ఘనత సాధించారు. ఐర్లాండ్ పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు ఎన్డా కెన్నీతో ప్రధాని సమావేశమవుతారు. అనంతరం అక్కడి భారత సంతతి ప్రజలతో ఇంటరాక్ట్ అవుతారు. సాయంత్రం ఐర్లాండ్ నుంచి అమెరికాకు బయలుదేరుతారు. ఐదు రోజుల అమెరికా పర్యటనలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నెల 29న స్వదేశానికి తిరిగివస్తారు.