మోడీ మాట్లాడి తీరాలి

mayawati-621x414క్యాష్ బ్యాన్ సమస్య చాలా సున్నితమైనదని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. పార్లమెంట్ ఆవరణలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. క్యాష్‌బ్యాన్ సమస్యపై ప్రధాని మోదీ సభలో మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఇవాళ రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. మాయావతి ఇప్పటికే పలువురు పార్టీ నేతలతో కలిసి పాద యాత్ర కూడా చేశారు. మోడీ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అని అన్నారు.