మోడీ సందేశాన్ని రైతులు తిలకించండి

నేడు నిర్వహించనున్న రామగుండం ఎరువుల కర్మాగారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నియోజకవర్గ స్థాయి రైతులు ఆయన అందించే గొప్ప సందేశాన్ని తిలకించాలని                                    వంగూరు మండల కిసాన్ మోర్చ మండలాధ్యక్షుడు సంపత్ నవీన్ రెడ్డి కోరారు. శుక్రవారం ఆయన అధ్యక్షతన సమావేశం నిర్వహించి మాట్లాడారు మోడీగారి చేతుల మీదుగా ప్రారంభించే  ఎరువుల కర్మాగారం కార్యక్రమం అచ్చంపేట పట్టణంలో సత్యలక్ష్మీ ఫంక్షన్ హాలులో పెద్ద స్క్రీన్ తో ఏర్పాటు చేసి రైతులు వీక్షించె విదంగా బీజేపీ ఏర్పాట్లు చేసిందని కాబట్టి నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున రైతులను ఈ కార్యక్రమానికి హాజరు పరచాలని కిసాన్ మోర్చ మండలాధ్యక్షుడు సంపత్ నవీన్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లె భీమయ్య, ఓబిసి మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు విప్పలపల్లి ఈశ్వర్,మండల ప్రధాన కార్యదర్శి సిలివేరు సైదులు,  మైనార్టీ మోర్చ అధ్యక్షుడు సమీర్,కార్యదర్శి తంగేళ్ల శివ మరియు నాయకులు ఒరే రాములు, పరమేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.