మోత్కూర్ లోజోరుగా ప్రచార హోరు,

దోమ నవంబర్ 23(జనం సాక్షి)
ఎన్నికలకు మరో వారం రోజుల గడువు ఉండడం తొ దోమ మండలం లో ఏం ఎల్ ఎ అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డీ జెడ్పీటీసీ నాగిరెడ్డి ఆయా గ్రామాల పార్టీ ముఖ్యులతో కలిసి మూడు రోజులుగ నిర్వహించిన ఎన్నికల ప్రచార హోరు ఉత్సాహంతో ముందుకు నడుస్తుంది.దోమ మండల పరిధిలోని గుండాల నుండి ప్రారంభము చేసిన ప్రచార హోరు సోమ మంగళ వారాల్లో దాదాపు 24 గ్రామ పంచాయతీ లు పూర్తి చేశారు. తదుపరి గురువారం మిగిలిన గ్రామ లలో ప్రచారం గావించారు.
ఏ గ్రామానికీ వెళ్ళిన ప్రజలు బ్రహ్మ రథం పట్టడం తొ బీ అర్ ఎస్ శ్రేణులు ల్లో నూతన ఉత్సాహం కనబడుతుంది. ఏం ఎల్ ఎ అభ్యర్థి కొప్పుల మహేష్ రెడ్డీ, జెడ్పీటీసీ నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం మాట్లాడుతూ రాష్ట్రంలో అమలు అవుతున్న వివిధ రకాల సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించడం తొ ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. ఏ గ్రామములో చూసిన అభ్యర్థికి స్వాగతం పలికే కార్యక్రమాల లో కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని చేస్తున సందడి అంతా ఇంతా కాదు గంటలో ఒక గ్రామం ముగించు కుందం అని అనుకుంటే ప్రతీ గ్రామంలో రెండూ మూడూ గంటలు పట్టడం తొ రాత్రి తొమ్మిది గంటలకు కుడా ప్రచారం కొనసాగించారు.
“”కాంగ్రెస్స్ పార్టీ కల్లబొల్లి మాటలు నమ్మొద్దు..””
కాంగ్రెస్స్ పార్టీ ఇస్తున్న కల్ల బొల్లి మాటలు ప్రజలు నమ్మొద్దు అని అభ్యర్థి మొదలు కోని కింది స్థాయి నాయకుల వరకు అదే నినాదం చేస్తుండడం గత పదేళ్ల క్రితం కాంగ్రెస్స్ పార్టీ అధికారంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడూ ఉన్న పరిస్థితులు ప్రజలకు వివరిస్తుండడం వల్ల ప్రజలు కూడా పదేళ్ల కిందట ఉన్న పరిస్థితులు బేరీజు వేసుకుంటున్న ముఖ్యంగా కరెంట్, పెన్షన్, రైతు బందు, వంటి అమలు అవుతున్న అనెక జనకర్షన పతకాలతొ పాటూ ప్రస్తుతం పెంచే పెన్షన్లు, మళ్ళి సౌభాగ్య లక్ష్మి, కొత్త పతకము ద్వారా 3 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం తొ కేసిర్ ను మళ్ళి నమ్మే స్థితికి ప్రజలు దరిదాపుల్లో ఉన్నారని తెలుస్తుంది.
“రైతుల్లో కరెంట్ చర్చ”
మూడూ అయిదు గంటల కరెంట్ చాలు ఆన్న కాంగ్రెస్ నాయకుల ప్రకటనలు అలాగె పది అసుపర్ల మోటార్లు బిగించుకోవలి అని స్వయంగా పిసిసి అధ్యక్షుడు చెప్పరాని వింటున్న వార్తల పట్ల రైతాంగం కాంగ్రెస్స్ వస్తె నిజంగానే కరెంట్ సమస్య వస్తుంది అని చర్చించు కోవడం కొసమెరుపు. పదేళ్ల కిందటే కరెంట్ ఇప్పటి కరెంట్ గురించి రైతాంగం గృహిణులు చర్చించు కుంటున్నారు. తెలంగాన వచ్చాకే కరెంట్ బాగుంటుంది అని అలాగె రైతు భీమా, మాదిరి భూమి లేని వారికీ కుడా ఇన్సూరెన్స్ చెసి సాధారణ చావులకు కుడా భీమా వర్తించేలా ఇస్తున్న హామీ పట్ల కుడా చాల మంది స్వాగతిస్తున్నారు. ఏది ఏమైనా మళ్ళిపరిగిలో మహేష్ రెడ్డి రాష్ట్రంలో కేసిర్ సీఎం అయ్యి హ్యాట్రిక్ సాధిస్తరెమో అని విద్యావంతులు యువకులు చర్చింకుంటున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు సంపళ్లి మల్లేశం,మల్లయ్య జనగామ,సలీం, శశిధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, నందయ్య , కరణం శ్రీకాంత్ రావు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు.