మహిళలు ఇంటిపేరు మార్చుకోనక్కర్లేదు
పెళ్లి చేసుకున్న మహిళలు లేదా విడాకులు తీసుకున్న మహిళలు తమ ఇంటిపేరును పాస్ పోర్టులో మార్చుకోవాల్సిన అవసరం లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ అన్నారు. తల్లిదండ్రుల పేర్లు ఆధారంగా తగిన డాక్యుమెంట్లు పొందొచ్చని ఆయన స్పష్టం చేశారు. పాస్ పోర్ట్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించారు. పాస్పోర్ట్ పొందాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్గానీ, విడాకుల ధృవపత్రంగానీ సబ్మిట్ చేయాల్సిన అవసరముండదని మోడీ చెప్పారు.మహిళ ఇష్టం మేరకే తల్లిపేరు లేదా తండ్రి పేరును పాస్ పోర్ట్పై వచ్చేలా నిబంధన తీసుకువచ్చినట్లు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని పాల్గొన్న ఓ కార్యక్రమంలో ఈ విషయాలను వెల్లడించారు.