యాచారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నిరాహార దీక్ష ప్రారంభం

రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం ,జూలై   (జనం సాక్షి)ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సి వర్గీకరణకు చట్టబద్దత కల్పించాలని కోరుతూ,  మందకృష్ణ మాదిగ రిలే నిరాహార దీక్షలు , నిరసనలకు పిలుపునిచ్చిన నేపత్యంలో యాచారం మండల కేంద్రంలో  మండల్ ఇంచార్జ్ కొమ్ము మహేష్  ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చింతుల్ల సాయిలు ,యాచారం గ్రామ శాఖ అధ్యక్షులు మూలి మహేష్ , నందివనపర్తి  గ్రామ శాఖ అధ్యక్షులు యంజాల చంద్రకాంత్ , జనరల్ సెక్రటరీ కందికంటి ఆనంద్, మాల్ జనరల్ సెక్రటరీ మంద లింగం , మస్కు అబ్బయ్య  , మండల నాయకులు మస్కు నవీన్, నందివనపర్తి మాజీ జనరల్ సెక్రటరీ యంజాల వెంకటేష్, సీనియర్ నాయకులు గడ్డమీది మదార్ , ప్రసాద్  తదితరులు పాల్గొనడం జరిగింది.. తదనంతరం టీడీపీ మండల్ జనరల్ సెక్రటరీ జోగు కృష్ణ దీక్షకి మద్దతు తెలిపి సంగీభావం తెలపడం జరిగింది…