యాదాద్రీశుడిని దర్శించుకున్న మోత్కుపల్లి నర్సింహులు

యాదాద్రి భువనగిరి,జూలై11(జనం సాక్షి):: యాదాద్రి శ్రీ లక్ష్మీ స్వామివారిని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాలినడక దర్శించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు యాదాద్రి పాదాల వద్దకు చేరుకున్న ఆయన మెట్ట మార్గం గుండా కాలినడకన స్వయంభు ఆలయానికి వెళ్లారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపారు. కరోనాతో బాధపడుతున్న తాను యాదాద్రి కృపతో ఆరోగ్యవంతంగా బయటపడ్డాను అని అందుకే స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయురారోగ్యాలతో జీవించాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు