యువకుడి దారుణ హత్య

కడప,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):యువకుడి దారుణ హత్యకు గురైన సంఘటన కడప జిల్లా స్థానిక మండల పరిధిలోని రైల్వే స్టేషన్‌ కు సవిూపాన చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం ఈ సంఘటన
వెలుగులోకి వచ్చింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడు రాజశేఖర్‌(19)  స్థానికంగా ఉన్న రాణివనంలోని కొట్టాలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మృతుడిని బండరాయితో కోట్టి హత్య చేసినట్లు ఆనవాళ్లు కనబడుతున్నాయి. మృతుడు పాలిష్‌ మిషిన్‌ లో కూలిపని చేసేవాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.