యువత స్కిల్ డెవలప్మెంట్ కోసం వంద కోట్లు
కేంద్రమంత్రులకు కొప్పుల ఈశ్వర్ వినతి
న్యూఢిల్లీ,నవంబర్19 (జనంసాక్షి) : ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖామంత్రి కొప్పుల ఈశ్వర్.. కేంద్ర మంత్రులు మహేంద్ర పాండే, ధర్మేంద్ర ప్రధాన్లను కలిశారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలోని ఆయా వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రులకు వివరించారు. యువత అభివృద్ధి కోసం నిధులు విడుదల చేయాలని ఆయన వారిని కోరారు. ఈ సందర్భంగా విూడియాతో మాట్లాడిన మంత్రి.. ఎస్సీ యువత స్కిల్ డెవెలప్మెంట్ కోసం 100 కోట్ల రూపాయలు ఇవ్వాలని మంత్రులను కోరినట్లు తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తోందన్న మంత్రి.. సీఎస్సార్ నిధుల నుంచి దివ్యాంగుల సదుపాయాలకు రూ. 10 కోట్లు ఇవ్వాలని కోరినట్లు మంత్రి విూడియాకు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్తో పాటు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పాల్గొన్నారు.