యూపిలో అనుమానిత బాంబు కలకలం

లక్నో,సెప్టెంబర్‌7(జ‌నంసాక్షి):ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో అనుమానిత టైమ్‌బాంబు కలకలం రేపింది. ఇస్మాయిల్‌ గంజ్‌ ప్రాంతంలోని ప్రభుత్వ అధికారి నివాసం సవిూపంలో బాంబు ఉందన్న సమాచారంతో అక్కడి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. రెవెన్యూ శాఖ అధికారి రవీంద్రవర్మ ఇంటి బయట ఎర్రటేపుతో కట్టి ఉంచిన ఓ ప్యాకెట్‌ వెలుపల ఓ గడియారం ఉన్నట్టు గుర్తించామని పోలీసులు తెలిపారు. వెంటనే బాంబుస్క్వాడ్‌కు సమాచారం ఇచ్చారు. దీనిపై ఎస్పీ దయానంద్‌ మిశ్రా మాట్లాడుతూ.. అది బాంబో లేదంటే ప్రజల్ని భయాందోళనకు గురిచేసేందుకు ఆకతాయిలు చేసిన పనో తెలియాల్సి ఉందని చెప్పారు.