యూపీలో రాష్ట్రపతి పాలన విధించాలి : మాయావతి
లక్నో : ఉత్తరప్రదేశ్ లో శాంతిభద్రతలు పూర్తిగా కుంటుపడ్డాయని బీఎస్పీ చీఫ్ మాయావతి మండిపడ్డారు.రాష్ట్రంలో కిడ్నాఫ్లు ,లూటీలు ,మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అందువల్ల రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.