: కోల్కతాలోని నేతాజీ సుభాష్చంద్రబోస్ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ బస్సు రన్వేపై ఆగి ఉన్న ఎయిర్ ఇండియా విమానాన్ని ఢీకొంది. కాసేపట్లో విమానం సిల్చార్ నుంచి అస్సోం వెళ్లాల్సి ఉండగా జెట్ బస్సు అదుపు తప్పి విమానాన్ని ఢీకొంది. ఈ విషయమై బస్సు డ్రైవరును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని అధికారులు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో విమానంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.