రాజీనామా చేయకపోవడం శోచనీయం : ఎంపీ నామా

ఢీల్లీ : తప్పు చేశారని ఛార్జీషీటులో చెప్పినా, మంత్రులు రాజీనామా చేయకపోవడం శోచనీయమని తెదేపా ఎంపీ  నామా నాగేశ్వరరావు అన్నారు. మంత్రులు కొనసాగితే కేసును నీరుగార్చడం, తారుమారు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఛార్జిషీటులో పేరున్న మంత్రులు రాజీనామా చేసి నిజాయతీ నిరూపించుకోవాలన్నారు.