రాజీవ్‌ గాంధీ సేవలు చిరస్మరణీయం

` ఘనంగా నివాళి అర్పించిన సీఎం రేవంత్‌
హైదరాబాద్‌,మే21(జనంసాక్షి):రాజీవ్‌ గాంధీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రధానిగా ఐటీ రంగ వృద్ధికి రాజీవ్‌ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. నగరంలోని సోమాజిగూడలో రాజీవ్‌గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్‌ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహవారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ అక్కడి న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.