రాజ్యసభ ముందుకు జువైనల్‌ యాక్ట్‌

5

జువైనల్ యాక్ట్ కు సంబంధించిన బిల్లును కేంద్రం ఇవాళ రాజ్యసభలో ప్రవేశ పెట్టనుంది. నిర్భయ కేసులో బాల నేరస్థుడు విడుదల కావటంతో.. ఈ చట్టాన్ని కఠినం చేయాలని భావిస్తున్నారు. బాల నేరస్థుల వయోపరిమితి 18 నుంచి 16 ఏళ్లకు తగ్గించాలని నిర్భయ అత్యాచార ఘటనతో కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బిల్లు సైతం లోక్ సభలో పాసైంది. ఐతే రాజ్యసభలో బిల్లు పెండింగ్ లో ఉంది. ఇవాళ జువైనల్ యాక్ట్ పై సభలో చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ సైతం ఈ బిల్లుకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.