రాజ్యసభ రేపటికి వాయిదా
దిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఏపీ పునర్విభజన చట్టం అమలుపై స్వల్పకాలిక చర్చ అనంతరం సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఉపఛైర్మన్ కురియన్ ప్రకటించారు. ఏపీ విభజన చట్టంపై స్వల్పకాలిక చర్చను శుక్రవారం కొనసాగిద్దామంటూ సభను వాయిదా వేశారు. ఈ చర్చను కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ ప్రారంభించగా.. చర్చలో పాల్గొన్న సభ్యులంతా ఏపీ విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ముక్తస్వరం విన్పించిన సంగతి తెలిసిందే.