రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రపతి నివాళి

1

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌ 125 వ జయంతి ఉత్సవాలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. పార్లమెంట్ ఆవరణలోని అంబేద్కర్‌ విగ్రహానికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నివాళ్లు అర్పించారు. అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్, కాంగ్రెస్ ప్రెసిడెంట్ సోనియ గాంధీ సైతం నివాళ్లర్పించారు. కేంద్రమంత్రులు, ఎంపీలు సైతం అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలాలు వేసి ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.