రామకుప్పంలో నకిలీ నోట్ల మార్పిడి
2కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం: ఆరుగురు అరెస్ట్
చిత్తూరు,జూలై23(జనంసాక్షి): చిత్తూరు జిల్లా రామకుప్పం మండల పరిధిలో రూ.2 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లను కుప్పం సర్కిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు బాధ్యులైన ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. రామకుప్పం మండల పరిసరాలలో నోట్ల మార్పిడి చేస్తున్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. కలర్ జెరాక్స్తో ముద్రించిన నోట్లను మారుస్తున్నట్లు గుర్తించారు. నిందితుల్లో ముగ్గురు తిరుపతి, ఒకరు కుప్పం, ఇద్దరు బెంగళూరువాసులు ఉన్నట్లు చెబుతున్నారు.