రామన్నగూడెం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ విస్తృత ప్రచారం.

ఏటూరు నాగారం నవంబర్ 22,
(జనం సాక్షి):
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెం గ్రామంలో
బి అర్ ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు గారి ఆదేశాల మేరకు బడే నాగజ్యోతి అక్కను గెలిపించడం కోసం రామన్నగూడెం కార్యకర్తలు ఇంటింటి ప్రచారాన్ని ముమ్మురంగా ముందుకు తీసుకు వెళ్తూ ప్రతి గడప గడపకి కేసిఆర్,గారి సంక్షేమ పథకాలు అన్ని వివరిస్తూ నాగజ్యోతి అక్క గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని కంకణబద్ధులై ప్రచార కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఇంటింటి ప్రచారం కొనసాగించారు. గ్రామ కమిటీ అధ్యక్షులు ఇట్టం నాగరాజు గారు, సర్పంచ్ దొడ్డ కృష్ణ , ఎంపిటిసి సుమలత, శ్రీనివాస్, డైరెక్టర్లు ఎగ్గడి కోటయ్య , దొడ్డ పుల్లయ్య, యూత్ అధ్యక్షులు అల్లి రంజిత్ ,బి ఆర్ ఎస్ నాయకులు గద్దల శ్రీరాములు, కారం పోషాలు, కాట లక్ష్మీనర్సు, అల్లి రఘు, కాట రాంబాబు, చింత శేఖరు, గుండపు కృష్ణ, పల్ల మల్లికార్జున, బోల్లే రాంబాబు, కాపుల జగన్, యువకులు, 100 ఓట్లు ఇంచార్జిలు, బి ఆర్ ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.